Samantha : మాజీ భర్త నాగచైతన్య సినిమాపై సమంత పోస్టు.. త్వరలో వీరు మళ్లీ కలిసేనా?

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య- సమంతల వైవాహిక బంధం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా, వారు మళ్లీ కలిస్తే బాగుండని, అసలు వారు విడిపోకుండా ఉండాల్సిందని భావించే వారు చాలా మంది ఉన్నారు.

వారిరువురు వివాహ బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ గా కలిసే ఉంటామని ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ పోస్టు పెట్టింది.

‘త్రీ ఇయర్స్ ఫర్ మజిలీ’ అని పేర్కొంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఆ పోస్టు చూసిన నెటిజన్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ స్టోరిలోనైనా మళ్లీ నాగచైతన్య సినిమాకు సమంత స్పేస్ ఇచ్చిందని అనుకుంటున్నారు. ఈ సినిమా చేస్తున్నపుడు సమంత-నాగచైతన్యలు రీల్ ప్లస్ రియల్ లైఫ్ కపుల్ గా ఉన్నారు.

ఇక నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రంలో వీరు హీరో, హీరోయిన్స్ గా నటించబోతున్నారని వార్తలొస్తున్నాయి. కానీ, ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. చూడాలి మరి.. నిజంగానే వీరు మళ్లీ కలిసి సినిమా చేస్తారో లేదో.. ఈ సంగతులు పక్కనబెడితే..సమంత, నాగచైతన్య ఇద్దరూ ఎవరికి వారు ప్రజెంట్ తమ ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేశారు. సమంత తన సినిమాల విషయమై ముంబైకి కంప్లీట్ గా షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news