మంత్రి హరీష్ రావు కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

-

టీ పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు బహిరంగ లేఖ రాశారు.నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు అని ఇది చాలా దుర్మార్గం అని అన్నారు.

ప్రసూతి సెలవులు నుంచి జీతాలు పే స్లిప్ ల వరకు ఇవ్వకపోవడం కట్టు బానిసత్వం కిందకు వస్తుందన్నారు.ఆసుపత్రులలో నర్సుల పాత్ర చాలా కీలకమని, గత పది రోజులుగా ఎర్రటి ఎండలో ఆందోళన చేస్తున్న నర్సుల గురించి నిమ్స్ యాజమాన్యం, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ సేవలందిస్తున్న నర్సుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సుల డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news