Akshay Kumar: అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ OTT స్ట్రీమింగ్ టైమ్ లాక్‌డ్

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన పిరియాడికల్ ఫిల్మ్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఫిల్మ్ ..ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే, ఈ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది. తాజాగా ఈ సినిమా OTT టైమ్ లాక్ అయింది. Amazon Prime Video అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వారు ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. వచ్చే నెల(జూలై) 1 నుంచి ఈ పిక్చర్ ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా ఇచ్చారు. శక్తిమంతమైన రాజు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి చేరుతుందని తాను భావిస్తున్నానని అక్షయ్ చెప్పుకొచ్చారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ సూద్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు.

 

View this post on Instagram

 

A post shared by amazon prime video IN (@primevideoin)

Read more RELATED
Recommended to you

Latest news