జ‌గ‌న్‌కే షాక్ ఇచ్చిన లేడీ లీడ‌ర్‌… ఏం దెబ్బ కొట్టిందిలే…?

-

జ‌గ‌న్‌కే షాక్ ఇచ్చిన ఓ లేడీ లీడ‌ర్‌.. ఇప్పుడు ఈ విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఎదురు చెప్పే సాహ‌సం కూడా ఎవ్వ‌రూ చేయ‌డం లేదు. మ‌రి ఇలాంటి టైంలో జ‌గ‌న్‌కే షాక్ ఇచ్చిన ఆ లేడీ లీడ‌ర్ ఎవ‌రు ?ఆ క‌థేంటో చూద్దాం.  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి వారి వంశం ఆడ‌ప‌డుచు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు.. ఇటీవ‌ల వార్తల్లో బాగా హైలెట్ అవుతోంది. బీజేపీలో ఉన్న సంచ‌యిత‌కు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పూస‌పాటి వారి చేతుల్లో అది కూడా అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా ఉన్న మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి ఆయ‌న్ను త‌ప్పించిన జ‌గ‌న్ సంచ‌యిత‌ను చైర్మ‌న్ చేశారు.

అలాగే ఈ క‌మిటీలో స్థానిక విజ‌య‌న‌గ‌రం ఎంపీతో పాటు ఎమ్మెల్యేను కూడా స‌భ్యులుగా నియ‌మించారు. ఇక ఆమెను ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సింహాచ‌లం దేవ‌స్థానం చైర్మ‌న్‌గా కూడా నియ‌మించారు. దీంతో సంచ‌యిత బాబాయ్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు కోర్టుకు కూడా ఎక్కారు. అయితే పూస‌పాటి కుటుంబ స‌భ్యులు మాత్రం ఆమెకు త‌మ కుటుంబానికి సంబంధం లేద‌ని.. ఆమె త‌ల్లి ఆనంద గజపతిరాజు నుంచి ఎప్పుడో విడాకులు తీసుకున్నార‌ని చెపుతోంది. ఈ క్ర‌మంలోనే సంచ‌యిత‌ను ఏదోలా త‌మ వైపున‌కు తిప్పుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను విజ‌య‌న‌రం ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని వైసీపీ ప్ర‌ణాళిక‌ల‌తో ఉంది.

అయితే వైసీపీ ప్లానింగ్ ఇలా ఉంటే సంచ‌యిత మాత్రం వైసీపీకి ఝుల‌క్ ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాను మాత్రం ఇప్ప‌ట‌కీ బిజేపీనే అని చెప్ప‌డంతో వైసీపీ వాళ్లు ఇప్పుడు షాక్‌లోకి వెళ్లిపోయారు. సంచ‌యిత మొత్తానికి డ్యూయ‌ల్ రోల్ ఆడుతోంద‌ని.. ఆమె ఇటు వైసీపీ ఇచ్చిన ప‌ద‌వులు తీసుకుంటూనే అటు బీజేపీ అని చెప్పుకుంటోంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు ప‌రిస్థితిని బ‌ట్టి ఆమె ఎటు వైపు కావాలంటే అటు వైపు మొగ్గేలా గేమ్ ఆడుతున్నార‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా జ‌గ‌న్ సంచ‌యిత‌కు బిగ్ ఆఫ‌ర్ ఇచ్చినా ఆమె బీజేపీనే పట్టుకొని వేలాడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news