మ్యాచ్ తర్వాత కంటతడి పెట్టిన సానియా మీర్జా

-

ఎల్ బి స్టేడియంలో సానియా మీర్జా చివరి మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌ అయిపోగానే, ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయింది సానియా మీర్జా. మ్యాచ్ తర్వాత కంటతడి పెట్టిన సానియా మీర్జా… మీడియాతో మాట్లాడింది. అభిమానుల కోసం చివ‌రి మ్యాచ్ ఆడాను అని తెలిపింది.

20 ఏళ్ల క్రితం నేను ఎక్క‌డ టెన్నిస్ ప్రాక్టీస్ చేశానో.. అక్క‌డే ఆఖ‌రి మ్యాచ్ ఆడనని చెప్పింది. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు వ‌చ్చారని వివరించారు. కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూశానని… విజ‌యంతో కెరీర్‌ను ముగించాలని అనుకున్నానని పేర్కొన్నారు సానియా మీర్జా. నా కుమారుడు, కుటుంబంతో స‌మ‌యం కేటాయించాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు సానియా మీర్జా.

Read more RELATED
Recommended to you

Latest news