Sarkaru Vaari Paata: బాక్సాఫీసు నుంచి డబ్బుల రికవరీకి వచ్చేస్తున్న మహేశ్ బాబు..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయం తెలుసుకుని సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్ చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘సర్కారు వారి పాట’ మూవీ యూనిట్. చిత్ర షూట్ కంప్లీ్ట్ అయినట్లు ట్విట్టర్ వేదికగా పోస్టర్ ద్వారా తెలిపింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తు్న్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరికొత్త పాత్రలో కనిపించనున్నారు.

మహేశ్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ , 14 రీల్స్ వారు కలిసి పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ సూపర్ హిట్ అయి ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతున్నాయి.

త్వరలో ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ లో మాస్ మసాలా సాంగ్ కూడా ఉంది. అది కూడా త్వరలో విడుదల కానుంది. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news