కాంగ్రెస్ లేవలేని స్థితిలో ఉంది…అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ : మంత్రి సత్యవతి

-

కాంగ్రెస్ లేవలేని స్థితిలో ఉంది…అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని పేర్కొన్నారు మంత్రి సత్యవతి. మహబూబాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత దేశం అన్ని మతాల కులాల వేదిక అని.. దేశములోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని వెల్లడించారు.

భారత దేశాన్ని విచ్చినం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది… ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో ఉందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లెవలేని స్థితిలో ఉంది… దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ శూన్యతను గుర్తించి కేసీఆర్ జాతీయ పార్టీ ని పెడుతున్నాడన్నారు.

దేశ వ్యాప్తంగా ఆకలి చావులు ఉన్న మత పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది… దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో విద్యుత్ కోతలు ఉన్న తెలంగాణ లో లేదని తెలిపారు. బిజెపి కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పుతున్నడు… దేశంలో బీజేపీ కి ప్రత్యన్యయం లేదని రెచ్చిపోతున్నరు… దేశాన్ని దోచుకోవడమే పనిగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయానికి అనేక పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి… గిరిజన రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రంలో బీజేపీ ఆమోదం తెలపడం లేదని తెలిపారు. తండాలను గుడాలను పంచాయతీ లు చేసిన ఘనత కేసీఆర్ ది… గిరిజన యూనివర్సిటీ కోసం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించిన నేటి వరకు కేంద్రం నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news