గవర్నర్‌ తమిళి సై..ఓ బీజేపీ కార్యకర్త – మంత్రి సత్యవతి

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై పై మంత్రి సత్యవతి రాథోడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని బెదిరించినట్టు మాట్లాడారని…. బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. గవర్నర్‌ తల్చుకుంటే.. ప్రభుత్వం కూలిపోతుంది అనడం సరికాదు, గవర్నర్‌ మనస్సులో ఏం ఉందో అర్థమవుతుందని చురకలు అంటించారు మంత్రి సత్యవతి రాథోడ్‌.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై కి సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎప్పుడు మంచి గౌరవమే ఇచ్చిందని చెప్పారు. కానీ.. గవర్నరే కావాలని దీనిపై రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గవర్నర్ ఒక మహిళ అని సీఎంగారు మహిళలను గౌరవిస్తారని సత్యవతి రాథోడ్ అన్నారు. గతంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అన్నదమ్ముల్లాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని ఆమె అన్నారు. తనకు, ప్రభుత్వానికి గ్యాస్ ఎక్కడ వచ్చిందో గవర్నర్ గారే చెబుతున్నారని… కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీతోనే వివాదం మొదలైందని ఆమె అంటున్నారని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news