కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. ఆ వడ్డీ రేట్లు పెంపు..

-

ప్రముఖ ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు భారీ షాక్ ను ఇచ్చింది.. ముఖ్యంగా లోన్ తీసుకొనే వారికి ఇది చేదు వార్తే..మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది.ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం మేరకు పెంచింది. అలాగే వివిధ కాలపరిమితి డిపాజిట్‌ రేట్లను కూడా 0.05 శాతం నుంచి 0.25 శాతం మేరకు పెంచింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. కనీస వడ్డీరేటు 7.95 శాతం అవుతుంది. ఈ పెంపు హోమ్‌, ఆటో రుణాల కస్టమర్లకు ఏ మాత్రం భారం ఉండదని తెలిపింది.. ఈ వడ్డీ రేట్లు ఈరోజు నుంచే వస్తాయని వెల్లడించింది..

ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది.. దీనిద్వారా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు..ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్లను ఒకసారి చూస్తే..

1-3 నెలలు 8.10 శాతం

6 నెలలు 8.40 శాతం

ఏడాది 8.50 శాతం

రెండేళ్లు 8.60 శాతం

మూడేళ్లు 8.70 శాతం

డిపాజిట్ లపై వడ్డీ రేట్లు..రూ.10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ వడ్డీ రేటు 2.70 శాతం ఉండగా, రూ,10 కోట్ల కన్నా పైబడితే 3 శాతం, రూ.2 కోట్లు లోపు డిపాజిట్లకు టైం పిరియడ్ వడ్డీ రేట్లను ఒకసారి తెలుసుకుందాం..

1-2 సంవత్సరాలు 6.80 శాతం

2-3 సంవత్సరాలు 7 శాతం

3 సంవత్సరాలు పైన 6.50 శాతం

రూ.2 కోట్లు పైబడినబల్క్‌ డిపాజిట్‌ రేట్లకు వడ్డీ రేటును 0.25 శాతం నుంచి 0.50 శాతం మేరకు పెంచింది. మిగిన వాటిపై కూడా వడ్డీ రేట్లను పెంచింది..ఇక వివిధ కాల పరిమితుల ఆధారంగా ఈ రేటు 4.75 శాతం నుంచి 6 శాతం మధ్యన ఉంటుందని బ్యాంకు తెలిపింది..

Read more RELATED
Recommended to you

Latest news