BREAKING : ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భద్రతా వైఫల్యం !

-

BREAKING : ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భద్రతా దళాలు మరోసారి పూర్తిగా వైఫల్యం చెందాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సమయంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి బెలూన్లు వదిలారు కాంగ్రెస్ నేతలు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లు వదిలారు యువకులు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ ఉన్నారు. అయితే… ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేసిన ఎమ్మార్పీఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలాజానాథ్‌ ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news