భక్తులకు గుడ్ న్యూస్.. రూ.116 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు

-

శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌ సూచించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని సజ్జనార్ తెలిపారు. రూ.116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించారు. ‘గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించాం. శ్రీరామనవమికి వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అని కోరారు. ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌  వి.రవీందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news