Breaking : కాబుల్‌ దాడిలో 23కి చేరిన మృతుల సంఖ్య

-

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విద్యాసంస్థపై జరిగిన ఆత్మాహుతి దాడి రక్తసిక్తమైంది. ఈ ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. వీరిలో అత్యధికులు యువతులేనని తెలుస్తోంది. అయితే.. ఈ దాడిలో మరో 30 మంది వరకు గాయపడ్డారు. పశ్చిమ కాబూల్ లోని దాష్త్-ఏ-బర్చీ ప్రాంతంలో కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ భారీ విస్ఫోటనంతో దద్దరిల్లింది. ఆ సమయంలో విద్యార్థులు ఓ పరీక్ష రాస్తున్నారు. కాగా, మృతుల్లో అత్యధికులు మైనారిటీ హాజారా తెగకు చెందినవారిగా గుర్తించారు.

Kabul blast kills teenagers sitting practice exam - BBC News

ఆఫ్ఘనిస్థాన్ లో హాజారాలు (షియా ముస్లింలు) బలహీనవర్గాలుగా గుర్తింపు పొందారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరచుగా దాడులు చేస్తుంటుంది. తాజాగా జరిగిన దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. కాగా, దాడి జరిగిన సమయంలో విద్యాసంస్థ ప్రాంగణంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news