సీఎం జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ..

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి నటుడు కైకల సత్య నారాయణ లేఖ రాశారు. ఇటీవల కరోనా బారీన పడ్డారు కైకాల. అయితే ఆ సమయంలో.. కైకలకు సీఎం జగన్‌ రెడ్డి ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోలుకున్నారు. ఇందులో భాగంగానే లేఖ రాశారు కైకల. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఙతలు చెప్పారు.

బిజీ షెడ్యూల్‌ లో ఉన్నప్పిటీకి.. వ్యక్తిగతంగా.. కాల్‌ చేసి… ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. కళాకారులు పట్ల అలాగే.. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని నటుడు కైకల సత్య నారాయణ లేఖ లో వివరించారు. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు తాను మరోసారి హృదయ పూర్వక ధన్య వాదాలు తెలియాజేస్తున్నానంటూ పేర్కొన్నారు కైకల.

 

Read more RELATED
Recommended to you

Latest news