బెజవాడ మర్డర్ లో సంచలన విషయాలు…!

-

బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో పోలీసులు నాగేంద్రనే హంతకుడు అని నిర్ధారించారు బెజవాడ పోలీసులు. పెళ్లి చేసుకున్నట్టు బయటకు వచ్చిన ఫోటోలను మార్ఫ్ చేసారు అని పోలీసులు పేర్కొన్నారు. దివ్య తేజస్వి తో దిగిన ఫోటో మార్ఫింగ్ గా గుర్తించారు. నిద్ర లేవగానే దివ్య తేజస్విని గదిలోకి వెళ్ళి గడియ పెట్టిన నిందితుడు… ఆమెపై దాడికి దిగాడు.

బయట నుంచి తలుపులు తీయాలని దివ్య తల్లి అరుస్తున్నా సరే తీయకపోవడంతో కేకలు వేసారు. ఆ తర్వాతే దివ్య తేజస్వి పై కత్తితో దాడి చేసాడు. అప్పటికి అతనికి చిన్న గాయాలే అయ్యాయి అని పోలీసులు పేర్కొన్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా గొంతు కోసుకుని నాటకం ఆడాడు అని పోలీసులు పేర్కొన్నారు. దిశ పి ఎస్ కు దివ్య తేజస్విని కేసు బదిలీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news