ప్రియాంక స్కూటీని కావాలనే పంచర్ చేసారా…?

-

షాద్ నగర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా పోలీసులు కేసు దర్యాప్తు వేగం పెంచారు. ఆమె బుధవారం ఎక్కడికి వెళ్ళింది…? ఎవరితో మాట్లాడింది ఆనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె మృతదేహానికి షాద్ నగర్ లో పోస్ట్ మార్టం పూర్తి కాగానే పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక నిందితుల కోసం 15 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. ఇక కేసులో ఇప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆమెను చివరి సారిగా లారీ డ్రైవర్లు చుట్టు ముట్టారని ఏడుస్తూ ప్రియాంక ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. లారీ డ్రైవర్ల కారణంగా మా అమ్మాయి మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచర్ షాప్ వద్ద లభ్యం అయిన సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక రెడ్డి స్కూటీ టైర్ కావాలనే పంచర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చివరిసారిగా చెల్లి భవ్యతో కాకుండా ఇంకా ఎవరితో మాట్లాడింది అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్ హాస్పిటల్‌కు వెళ్లిన ఆమె తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని తన చెల్లికి ఫోన్ చేసింది. ఇక ఆమె మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటం సంఘటనా స్థలంలో ఆమె బండి లేకపోవడంతో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చంపేసి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఫోన్ నుంచి చివరిసారి ఎవరికి ఫోన్ చేసిందనే విషయం తెలిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news