రాజా సింగ్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి – వైఎస్‌ షర్మిల

-

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని.. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా భాద కలుగుతుందని.. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నారని ఆగ్రహించారు.

తెలంగాణ మంచి రాష్ట్రమని.. ఎన్నో మతాలకు,ఎన్నో సంప్రదాయాలకు నిలయమన్నారు. బీజేపీ ఒక మత పార్టీ…మత పిచ్చి ఉన్న పార్టీ అని రుజువు అయ్యింది… మత పేరు చెప్పి రాజకీయం చేస్తారని మరో సారి రుజువు అయ్యిందని మండిపడ్డారు.

ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడనీ మాటలు విన్నామని.. ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గ ప్రజల అందరికీ ఎమ్మెల్యే అని తెలిపారు. రాజసింగ్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరి కాదని…బీజేపీ సస్పెండ్ చేశాం అంటుంది..షో కాజ్ నోటీస్ ఇచ్చాం అంటుంది…సస్పెండ్ చేశాం అంటే బీజేపీ క్లియర్ గా చెప్పాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news