రైతుల చావులకు కారణమైన కేసీఆర్.. పాప ప్రక్షాళన చేసుకోవాలి : వైయస్ షర్మిల

-

రైతుల చావులకు కారణమైన తెలంగాణ సిఎం కేసీఆర్.. పాప ప్రక్షాళన చేసుకోవాలని వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పంజాబ్ రైతులకు తెలంగాణ సర్కార్ విడుదల చేసిన పరిహారంపై షర్మిల.. తన స్టైల్ లో స్పందించారు. చనిపోయిన రైతులు ఎందరు ? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? పరిహారం రాని మిగతా 6000 మంది పరిస్థితి ఏంటి? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

చావుల్లో కూడా తేడాలా? ఆ రైతు ఆత్మహత్యలన్నిటికి కారణం మీరు కాదా?పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా? అని నిలదీశారు షర్మిల. ముఖ్యమంత్రికి,మంత్రులకు,ఎమ్మెల్యేలకు జీతాలు ఆగిందిలేదని.. కాని రైతులు చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఏండ్ల తరబడి ఆగాలి, ఎందుకు? అని ప్రశ్నించారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనా? రైతుల చావులంటే పట్టింపు లేదా? అడిగే వారు లేరనా? ఇచ్చే పరిహారమే ఎక్కువ ఇంకా పట్టించుకునేది ఏంది అని అహంకారామా? అని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news