షర్మిలకు డిపాజిట్ కూడా రాదు :ఆరా సంస్థ

-

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు డిపాజిట్ కూడా రాదని ఆరా సంస్థ తెలిపింది.

వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేసింది. బాబాయ్ హత్య సెంటిమెంటుతో కడప బరిలో నిలిచిన షర్మిల వైపు ఓటర్లు నిలవలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ కారణంగా వైసీపీ గెలవాల్సిన 3 స్థానాలను కోల్పోనున్నట్లు ఆరా సర్వే పేర్కొంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వైయస్ షర్మిల కి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి. కాగా, మే 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version