ఇంకెంత మంది రైతులు చస్తే.. నీ కళ్ళు చల్లబడతాయి : కెసిఆర్ పై షర్మిల ఫైర్

-

సిఎం కెసిఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతులు నిరీక్షణ చేస్తున్నారని.. ఎప్పుడు వడ్లు కొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యాఖ్యమ చేశారు షర్మిల. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయని ఫైర్ అయ్యారు.

Sharmila
Sharmila

ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు..? అంటూ చురకలు అంటించారు. ఇంకెంత మందిని బలితీసుకొంటారు ? రైతులను కోటీశ్వర్లను చేసాం, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుందని విమర్శించారు. రైతులు కోటీశ్వరులు కావడం కాదు మీరు ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు పంట కొనక కాటికి పంపుతున్నారని టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news