బీసీలకు గురి పెట్టిన షర్మిల

-

ఇవాళ జరగబోయే కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ కింది నిర్ణయాలు తీసుకొని.. సిఎం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాం అంటూ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ ఒక ప్రకటన చేసారు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని ఆమె డిమాండ్ చేసారు. అన్ని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించాలి అని కోరారు.

కరోనాను నియంత్రించేందుకు 15 రోజులపాటు లాక్ డౌన్ విధించాలి అని డిమాండ్ చేసారు. ఆరోగ్యశాఖను బీసీ నేతకు కేటాయించాలి అని కోరారు. కరోనా బారినపడిన జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలి అని, అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతీ జర్నలిస్టుకు మీడియా అకాడమీ సహాయం అందేలా చూడాలి అని ఆమె కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news