BREAKING : రేపు ఢిల్లీకి వైయస్ షర్మిల.. కేసీఆర్ కు షాక్ తప్పదా !

-

వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నట్టు సమాచారం. రేవు షర్మిల ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాల సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు షర్మిల హస్తినకు పయనం అవటం పై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీపై షర్మిల తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ నిత్యం ఆరోపిస్తున్నారు. అయితే అన్ని విపక్ష పార్టీల కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా అక్టోబర్ 7న షర్మిల డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లి సిబిఐ కి ఫిర్యాదు చేశారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా పేర్కొన్న షర్మిల, 1.2 లక్షల కోట్లతో ప్రాజెక్టు కట్టామని ప్రభుత్వం చెబుతున్న, దాంట్లో భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. సిబిఐ డైరెక్టర్ ని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news