కాసేపట్లో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం.. పార్టీ ప్రకటన ఖాయమేనా ?

-

హైదరాబాదు లో ఉన్న లోటస్ పాండ్ నివాసంలో ఉదయం 10గంటల సమయంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైఎస్ అభిమానులు హాజరుకానున్నారు. అయితే ఈ రోజే పార్టీ ప్రకటన ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే దానిని ఖండించి ఖండించకుండా షర్మిల ఖండించారు..

తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ఎక్కడా ప్రస్తావించని ఆమె కేవలం కుటుంబాల మధ్య ఉన్న గొడవలను ఇలా బయట పెడతారా అంటూ మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. అన్న జగన్మోహన్ రెడ్డి తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావనలో ఉన్న ఆమె తెలంగాణ బేస్ గా పనిచేసేందుకు కొత్త పార్టీ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజం అనే విషయం ఈరోజు సమ్మేళనంలో తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news