సంజయ్‌ రౌత్‌ జ్యుడీషియల్‌ కస్టడీ మరోసారి పొడిగింపు

-

మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఈడీ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 వరకు సంజయ్ కస్టడీని పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసిన తర్వాతనే ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కొనసాగించనున్నట్లు తెలిపింది.

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించి పాత్రా వాలా చాల్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంజయ్ రౌత్ పై దాడికి దిగారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే.. గత ఆగస్టు 1న సంజయ్‌ రౌత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లు తన కస్టడీలో ఉంచుకుని విచారణ జరిపింది.

తర్వాత కోర్టులో హాజరుపరిచింది. ఈడీ ప్రత్యేక కోర్టు సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. విచారణ ఇంకా పూర్తికాలేదన్న ఈడీ అభ్యర్థనలతో కోర్టు సంజయ్ రౌత్‌ కస్టడీని పొడిగిస్తోంది. చివరిసారిగా విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా మరోసారి కస్టడీని పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news