షాకింగ్: 48 గంటలు తిరక్కుండానే నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయిన పాకిస్తాన్ !

-

గత వారం మే 5వ తేదీన పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజీలాండ్ తో నాలుగవ వన్ డే ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కివీస్ పై 102 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తో వరుసగా నాలుగు మ్యాచ్ లను గెలుచుకున్న బాబర్ సేన ఐసీసీ వన్ డే వరల్డ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా చరిత్రలో నెంబర్ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే.. ఈ ఆనందం పాకిస్తాన్ కు ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా 48 గంటలు కూడా ముగియకముందే పాకిస్తాన్ ఏకంగా మూడవ ర్యాంక్ కు పడిపోయింది.

గత రాత్రి ముగిసిన అయిదవ వన్ డే లో కివీస్ పై ఓడిపోవడం ద్వారా ర్యాంక్ ను కోల్పోయింది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా 113 రేటింగ్ పాయింట్ లతో మొదటి స్థానంలో ఉండగా, ఇండియా 113 రేటింగ్ పాయింట్ లతో రెండవ స్థానంలో మరియు పాకిస్తాన్ 112 రేటింగ్ పాయింట్ లతో మూడవ స్థానంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news