కృష్ణంరాజు అల్లుడు ఏం చేస్తారో తెలిస్తే షాక్..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన సినిమాలలోనే కాదు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలోనే కొనసాగిన ఈయన కేంద్ర మంత్రిగా కూడా పదవి స్వీకారం చేసి పాలించారు. ముఖ్యంగా తెలుగు చిత్ర రంగానికి సినీ దిగ్గజంగా పెద్దదిక్కుగా నటనలో తన నట విశ్వరూపాన్ని చూపించిన కృష్ణంరాజు గారి మరణం సినీ ఇండస్ట్రీకి ఒక తీరని విషాదం . ఇక ఈయన మరణం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీకి, అభిమానులకు, రాజకీయ నాయకులకు కూడా తీవ్రమైన శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఆయన మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇకపోతే కృష్ణంరాజు గారి అల్లుడు కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి అని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. కృష్ణంరాజు సినీ నటుడుగా రాణిస్తున్న రోజుల్లోనే సీతాదేవిని మొదటి వివాహం చేసుకున్నారు . అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకోవడం జరిగింది.ముఖ్యంగా ఆ అమ్మాయి అంటే కృష్ణంరాజుకు ఎనలేని ఇష్టం. ఆమె పేరు ప్రశాంతి. ఇక సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మరణించాక కుటుంబ సభ్యుల ఒత్తిడితో శ్యామలాదేవిని వివాహం చేసుకున్న కృష్ణంరాజుకు ముగ్గురు ఆడపిల్లలు కూడా జన్మించారు.

శ్యామల దేవి కూడా దత్తత తీసుకున్న ప్రశాంతిని కూడా కూతురితో సమానంగా చూసుకుంది. ఇక కృష్ణంరాజు ప్రశాంతిని స్వయానా తన మేనల్లుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అతను ఎవరో కాదు నరేంద్రనాథ్. ఇక ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టారు. అంతేకాదు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, బిల్లా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news