భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..!

-

విశ్వ నటుడు కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తన తండ్రి ఇన్ఫ్లుయేన్స్ ఏమాత్రం వినియోగించుకోకుండా తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మరి కొద్ది రోజుల్లో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారబోతోంది. ఇకపోతే తాజాగా ఈమె నటించిన రెండు స్టార్ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు సినిమాలకు సంబంధించి రిజల్ట్ కోసం ఆమె ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి రెండు సినిమాలలో కూడా ఈమె హీరోయిన్ కావడం విశేషం. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమా మంచి విజయం సాధించినా ఈమె కెరియర్ మారిపోయినట్టే.

ఇదిలా వుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్ కొన్ని మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టింది. చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి.. విపరీతమైన కోపంతో రగిలిపోతాను.. ఈ విషయంలో నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదు . మొదట ఈ విషయాన్ని బయట చెప్పకూడదనుకున్నాను. ఎవరు ఏమనుకుంటారో అని భయపడ్డాను. దాన్ని కూడా నా యొక్క మానసిక రుగ్మతగానే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ తెలిపింది.

ప్రస్తుతం తాను మానసిక పరిస్థితికి చికిత్స తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. కోపాన్ని తగ్గించుకోవడానికి పాటలు వింటున్నాను అని కూడా తెలిపింది. అనుకున్నది జరగకుండా అటు ఇటు అయితే మాత్రం షూటింగ్ సెట్ లో లేదా మరి ఎక్కడైనా సరే విపరీతమైన కోపం వస్తుందట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇలా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శృతిహాసన్ ఈ సమస్య నుంచి బయట పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news