ఆచార్య నుంచి బిగ్ అనౌన్స్ మెంట్.. ‘సిద్ధ సాగా’కు ముహూర్తం ఫిక్స్

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో సిద్ధార్థ గా నటిస్తున్న రామ్ చరణ్ టీజర్ ను నవంబర్ 28వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటన చేసింది. ఈ మేరకు మేకింగ్ వీడియోను కూడా వదిలింది చిత్ర బృందం. ఇక  ఈ తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news