కాకాని,సోమిరెడ్డి వార్..అసలు విషయం పక్కదారి పట్టిందా…!

-

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గంలో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కొనసాగుతుంది.ఇక్కడ ప్రత్యర్థులతో పాటు వారి అనుచరులు కూడా హద్దులు మీరి మరీ రాజకీయ వాగ్బాణాలు విసురుకుంటు వాతావారణాన్ని వేడెక్కిస్తున్నారు.దీంతో అసలు సమస్య పక్కదారి పట్టి కొసరుకు ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని అంటున్నారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రాజకీయ ఉద్దండులు నిరంతరం పోరాటం జరిపే నియోజకవర్గం.ప్రస్తుతం ఎంఎల్ఎ కాకాణీ గోవర్ణన్ రెడ్డి వరుసగా రెండోసారి ఇక్కడ ప్రాతినిద్యం వహిస్తున్నారు.మరోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థి.వీరిద్దరు అగర్బ శత్రువులస్థాయిలో రాజకీయం చేస్తుంటారు. ఇద్దరు కూడా జిల్లాలోని రాజకీయ దిగ్గజ కుటుంబాల నుంచి వచ్చిన వారే .నియోజక వర్గంలో కింది స్థాయినుంచి పట్టున్న వారే .తాజాగా ధాన్యం కొనుగొలు అంశం మరింతగా వీరి మద్య వున్న రాజకీయ వైరాన్ని ప్రపంచానికి చాటింది.

ఎడకారు ధాన్యం కొనుగొలులో దళారులతో పాటు అదికారులు చోటా మోటా నాయకుల పెద్ద ఎత్తున అవకతవకలకుపాల్పడ్డారు.రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగొలు చేసి అదే రైతు పేర్లతోపాటు కౌలు రైతుల గా రికార్డులు సృష్టించి పెద్ద ఎత్తున అవకతవకలకుపాల్పడ్డారు.అటు అదికార పక్షం ఇటు ప్రతిపక్షం ఈవిషయం మీదా దృష్టి సారించి పేదల కడుపు కొట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా ఏ అంశం వచ్చిన పరస్పరం వీరు అరోపణలు,ప్రత్యారోపణలు చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news