రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం..జగన్‌ ను గద్దె దించుతాం : సోము వీర్రాజు

-

కర్నూలు : రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని సవాల్‌ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. బీజేపీ జనసేన కలసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన చేశారు. టీడీపీ తో పొత్తు వుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పలేదు….మీరనుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. కేంద్రం నిధులతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని.. సోము వీర్రాజు ప్రకటన చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధం…సోము వీర్రాజు సవాల్ విసిరారు. వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ పై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తుంది….చంద్రబాబు సీఎం గా, జగన్ ప్రతిపక్షనేతగా అస్సెబ్లీలో ప్రత్యేక ప్యాకేజీపై చర్చ జరిగింది…మరి ఇప్పుడు లబ్ది కోసమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి తో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని వెల్లడించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news