BREAKING : ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..!

-

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, గత ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఆయన పదవిలో ఉన్నారు.

ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు.. అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కన్నా స్థానంలో ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పదవిని కట్టబెట్టింది. సోము వీర్రాజుకు పదవి దక్కడంపై ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news