వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు..క్లారిటీ ఇదే !

-

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ నేపథ్యంలోనే.. ఈ వార్తలపై సోమువీర్రాజు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ యాత్ర ను అడ్డుకోవడం ప్రజా స్వామ్యంలో ఆందోళన కలిగించే అంశమని..జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు‌ చేపట్టారని వెల్లడించారు.

వైసీపీ వారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేన పై కుట్ర చేశారని ఆగ్రహించారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని తెలిపారు సోము వీర్రాజు.

ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని.. వారు కూడా వైసిపి ప్రభుత్వం దుశ్చర్యలు పై పోరాడాలని సూచించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యల పై పోరు ఉమ్మడిగా సాగిస్తామని.. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news