మరోసారి మానవత్వం చాటుకున్న సోనూ సూద్..!

-

వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూ సూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూ సూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. తాజాగా.. చిత్తూరు జిల్లా కలగటూరు గ్రామాణీక చెందిన వెంకటరామయ్య అనే ఓ వృద్ధిడిని ఆవు తొక్కి గాయపరిచింది.

sonu-sood
 

వెంకటరామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. ఆటో వ్యక్తి అక్కడే మృత దేహాన్ని దించేసి వెళ్లిపోవడంతో అతని కుమార్తె బోరున విలపించింది. కరోనాతో చనిపోయాడని భావించి స్థానికులు ముందుకు రాలేదు. ఈ సంఘటనపై చెలించిన నటుడు సోనూ సూద్ ఆమెను ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news