సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..

-

మాజీ క్రికెటర్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. కరోనా బారిన పడ్డ గంగూలీ కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ హస్పిటల్ లో చేరారు. ఆయనకు ప్రస్తుతం నిపుణులైన వైద్యుల టీమ్ చికిత్సను అందిస్తోంది. గంగూలీకి ’’మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టైల్ థెరపీ‘‘ని ఇచ్చామని హస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ లో వెల్లడించాయి. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉందని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ, సీఈఓ డాక్టర్ రూపాలి బసు వెల్లడించారు.

నిన్ని కరోనాతో సౌరవ్ గంగూలీ కోల్ కతాలోని హాస్పిటల్ లో చేరారు. దీంతో ఆయన అభిమానుల్లో, క్రికెట్ లవర్స్ లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించడంతో ఫ్యాన్స్ లో కొంతైనా ఆందోళన తగ్గే అవకాశం ఉంది. ఇటీవల వరసగా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నాయకులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు కరోనా బారిన పడ్డారు. తాజాగా త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ కూడా కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news