బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా… పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం

-

పంజాబ్ ఎన్నికల ముందు బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ క్రికెటర్, ఓపెనర్ దినేష్ మోంగియా బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర బీజేపీ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ’’భారతీయ జనతా పార్టీలో చేరి పంజాబ్ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. నేడు దేశాభివృద్ధికి బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదు‘‘  అని  దినేష్ మోంగియా అన్నారు.

దీంతో పాటు పంజాబ్ నుంచి పలు రాజకీయ నాయకులు కూడా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఫతే బజ్వా, మాజీ ఎమ్మెల్యే అకాలీదళ్ గుర్తేజ్ సింగ్ గుధియానా, మాజీ పార్లమెంట్ సభ్యుడు యునైటెడ్ అకాలీదళ్ రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా, రిటైర్డ్ ఏడీసీ, పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయవాది మధుమీత్ ఈరోజు ఢిల్లీలో బీజేపీలో చేరారు.

ఇప్పటికే పలువురు క్రికెటర్లు వివిధ పార్టీల్లో ఉన్నారు. ప్రస్తుతం గౌతం గంభీర్ బీజేపీలో ఉన్నారు. ఆయనతో పాటు నవజ్యోత్ సిద్దూ, మహ్మద్ అజారుద్దీన్ లు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మనోజ్ తివారీ టీఎంసీ పార్టీలో ఉన్నారు. త్వరలో హర్బజన్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news