ప్రజలకు కరెంటు షాక్ ఇచ్చిన… కెసిఆర్ కు షాక్ ఇవ్వాల్సిందే : వైయస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కరెంటు షాక్ ఇచ్చిన… కెసిఆర్ కు షాక్ ఇవ్వాల్సిందేనని వైయస్ షర్మిల ఫైర్ అయ్యారు. YSR హయాంలో ఒక్కరోజు కూడా RTC చార్జీలు కానీ, కరెంట్ చార్జీలు కానీ, హౌస్ టాక్స్ లు కానీ పెరిగింది లేదన్నారు.
కానీ కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవని.. మొన్న RTC ఛార్జీలు, ఇవాల కరెంట్ ఛార్జీలు పెరిగాయని నిప్పులు చెరిగారు.


50 యూనిట్ల లోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లను కూడా వదలకుండా ముక్కు పిండి వసూల్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు షర్మిల. ఏడాదికి 6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపిండని అగ్రహించారు. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు తెచ్చిన అప్పుల మీద మిత్తికి మిత్తి ప్రజల నుంచే వసూల్ చేస్తుండని.. జనానికి కరెంట్ షాక్ ఇచ్చిన TRS కు ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉండాలని పిలుపు నిచ్చారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news