వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లే దిక్కు: అఖిలేశ్ యాదవ్

-

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ‘సున్నా’ సీట్లు రావడానికి అవకాశం ఉన్నదని సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అని ఎద్దేవా చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు. ఇక్కడి వాళ్లు ప్రచారం కోసం మాత్రమే వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు రావడానికి అవకాశం ఉన్నదని హస్తం పార్టీపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.

యూపీలో 2012-17 మధ్య కాలంలో కులతత్వ, క్రిమినల్ ప్రభుత్వం రాజ్య మేలిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించిన నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు.

ఉత్తర్‌ప్రదేశ్ కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి. బీజేపీని అధికారంలో నుంచి దించాలని ప్రజలు చూస్తున్నారు. కమలం పార్టీకి ప్రత్యామ్నయం సమాజ్‌వాది పార్టీ అని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీని అధికారం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదా? లేదా? విధానాలు, కార్యక్రమాలు, నిర్ణయాల్లో బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్దగా తేడా ఏమి లేదు. అవి రెండు ఒక్కటే అని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news