కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తే….

-

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తే. బెజవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నేటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం రోడ్-వరంగల్ ప్రత్యేక రైలు (07148) నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయలుదేరి రేపు ఉదయం ఆరు గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అలాగే, వరంగల్-బరంపురం ప్రత్యేక రైలు (07149) రేపు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది.

Railway Announce Special Trains For Vijayawada Bhavani Devotees

బరంపురం-విజయవాడ రైలు (07150) 17న మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-బరంపురం మధ్య నడిచే రైలు (07151) 15-20 తేదీల మధ్య ప్రతి రోజు విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఉదయం 11.15కు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07152 ) బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ మేరకు భవానీ భక్తుల కోసంనడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news