ఒలింపిక్స్ : సెమీస్ లోకి భారత రెజ్లర్..!

-

ఒలింపిక్స్ నుండి భారత అభిమానులకు చాలా సమయం తర్వాత ఓ శుభవార్త అందింది. భారత రెజ్లర్ అమన్ శరావత్ సెమీ ఫైనల్స్ లోకి చేరుకున్నాడు. పురుషుల 57 కిలోల విభాగంలో అమన్ పోటీ పడుతున్నాడు. అయితే ఈ విభాగంలో మొదటి రౌండ్ 16 లో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 10 పాయింట్స్ సాధించిన అమన్ శరావత్ క్వాటర్ ఫైనల్స్ లో కూడా అదే జోరు కొనసాగించాడు.

క్వాటర్స్ లో అల్బేనియా రెజ్లర్ తో పోటీ పడిన అమన్ శరావత్ ఇక్కడ కూడా ప్రత్యర్థి ఒక్క పాయింట్ ఇవ్వకుండా 12-0 తేడాతో విజయంను ఖాతాలో వేసుకొని సెమీస్ లోక్ అడుగు పెట్టాడు. ఇక ఇక్కడ జపాన్ కు చెందిన రెజ్లర్ ను ఎదుర్కోనున్న అమన్ శరావత్ తన జోరును ఇలానే కొసాగిస్తే ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మెడల్ తో భారత అభిమానులకు కొంత ఆనందాన్ని అందించగలుగుతాడు. ఇక ఈ అమన్ సెమీస్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 9:45 గంటలకు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news