రష్యా జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఆరేళ్ల హైదరాబాద్ అమ్మాయికి సిల్వర్ మెడల్

-

రష్యాలోని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఇండియా, తెలంగాణ నుంచి పోటీ చేసిన ఆరేళ్ల హైదరాబాద్ అమ్మాయి జైస్వి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఆమె కోచ్ ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. వారికి జైస్వి తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ జిమ్నాస్టిక్స్ పోటీలలో ఆయా దేశాల నుంచి 18 టీంలలో 250 మంది జిమ్నాస్టులు అండర్ 7 లో పాల్గొన్నారు.

ఈ పోటీలలో జైస్వి అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించింది. మణికొండ కు చెందిన విజయ్ బాబు – స్వప్నల ఏకైక కుమార్తె జైస్వి ఒకటవ తరగతి చదువుతోంది. మూడేళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో చేరి మణికొండ లోని జోయ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. మూడు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్న జైస్వి జిల్లాస్థాయి పోటీలలోను మెడల్స్ సాధించినట్లు కోచ్ అలీఖా తెలిపారు. జైస్వి కోచ్ అలీఖా స్వయంగా అంతర్జాతీయ క్రీడాకారిణి.

Read more RELATED
Recommended to you

Latest news