క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ టీమిండియా క్రికెటర్..

-

టీమిండియా క్రికెటర్, ముంబై వెటరన్‌ ఆల్‌రౌండర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. అయితే భారత్‌ తరఫున మూడు వన్డేలే ఆడిన 36 ఏళ్ల అభిషేక్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 103 మ్యాచ్‌ల్లో ఆడా డు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 13 సెంచరీలతో 5,749 రన్స్‌ చేయడంతో పాటు 173 వికె ట్లు తీశాడు. అయితే కేరళకు చెందిన అభిషేక్‌ కుటుంబం కొంతకాలం హైదరాబాద్‌లో నివాసముంది.

ఇక, ఈ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ ‘అవును. నేను రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశా. నెల క్రితమే నా నిర్ణయాన్ని వీరికి తెలియజేశా’ అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news