భువనేశ్వర్ ను WTC ఫైనల్ లో ఆడిస్తే బాగుంటుంది: ఆకాష్ చోప్రా !

-

ఐపీఎల్ సీజన్ 16 ముగిసిన అనంతరం కొంత గ్యాప్ తర్వాత ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా తో ఇండియా వర్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లలో ఆడే ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది. కాగా తాజాగా ప్రముఖ కామెంటేటర్ మరియు మాజీ ఇండియా ఆటగాడు ఆకాష్ చోప్రా, భువనేశ్వర్ ను ఈ మ్యాచ్ లో తీసుకుని ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ రాత్రి గుజరాత్ తో మ్యాచ్ లో భువి బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేసి అయిదు వికెట్లను పడగొట్టాడు.

ఇతను కనుక ఈమ్యాచ్ లో ఆడితే ఉపయోగంగా ఉంటుందని తన కోరికను బయటపెట్టాడు. అయితే ఇతనే ఇది జరగకపోవచ్చు అని కూడా చెప్పడం గమనార్హం. కాగా ఇప్పటికే స్క్వాడ్ ను ప్రకటించిన బీసీసీఐ.. భువిని ఎంపిక చేసే అవకాశమే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news