రేపు పాక్ తో మ్యాచ్ ఆడకండి..ఇండియాకు ఓవైసీ వార్నింగ్‌

-

టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా రేపు ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ పై అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు వెళ్లేది లేదన్న టీమిండియా, ఇప్పుడు పాక్ తో మ్యాచ్ ఎందుకు ఆడుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.

‘రేపు పాక్ తో ఎందుకు ఆడుతున్నారు. ఆడొద్దు కదా. మనం పాకిస్తాన్ వెళ్ళాం కానీ ఆస్ట్రేలియాలో పాక్ తో ఆడుతాం. టీవీ ఛానల్ లకు రూ. 2 వేల కోట్లు నష్టం వస్తాయని ఆడుతున్నారా? కానీ దానికంటే ఇండియా ముఖ్యం. మీరు ఆడకండి’ అని అన్నారు. అయితే.. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news