IND vs BAN : ఇండియాను ఆదుకున్న స్పిన్ ద్వయం..!

-

దాదాపు 40 రోజుల తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం మైదానం లోకి వచ్చిన భారత జట్టు.. ఈరోజు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చింది. అయితే తమ ప్లాన్స్ ప్రకారం మొదట భారత్ ను దెబ్బ తీసింది బంగ్లా. పేసర్ హసన్ మహమూద్ ఒక్కడే వరుసగా భారత టాప్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపించాడు. అయితే ఆ తర్వాత జైస్వాల్, పంత్ కొంత భాగసౌమ్యం నెలకొల్పినా వారిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు.

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా తమ బ్యాటింగ్ తో బంగ్లాకు చుక్కలు చూపించారు. బంగ్లా బౌలర్లకు సమయం ఇవ్వకుండా వారి పై దాడి చేస్తూనే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే సెంచరీ చేసుకున్న అశ్విన్ 102 పరుగులతో నాట్ ఔట్ గా నిలిచాడు. అలాగే జడేజా 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఇండియా మొదటి రోజు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news