ఆసియా కప్ లో ఇప్పటి వరకూ టీమిండియాదే ఆధిపత్యం, భారీ రికార్డులు ఇవే !

-

ఆసియా లో అతిపెద్ద క్రికెట్ ఈవెంట్ అంటే ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆగస్టు 28న టోర్నీలో బిగ్ మ్యాచ్ జరగనుంది. అంటే ఈ రోజున క్రికెట్ మైదానంలో భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు జరగనుంది. 2022 ఆసియా కప్ లో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఎన్నో భారీ రికార్డులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్ ఆదిక్యం ప్రదర్శించింది. ఈ టోర్నమెంట్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రికార్డులు..ఆసియా కప్ లో భారత్ అత్యంత బలమైన జట్టు. ఇప్పటివరకు ఈ టోర్నీలో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. అదే సమయంలో భారత్ తర్వాత శ్రీలంక 5 సార్లు పాకిస్తాన్ 2సార్లు గెలుపొందాయి. ఆసియా కప్ లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్ లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు. ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ గ్రేట్ బ్యాట్స్మెన్ సనన్ జయసూర్య రికార్డు సృష్టించాడు. అతను ఈ టోర్నీలో 25 మ్యాచ్లు ఆడి 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు. అదే సమయంలో దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. ఆసియా కప్ లో 23 మ్యాచ్లు ఆడి 971 పరుగులు చేశాడు.

ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. ఈ టోర్నీలో 24 మ్యాచ్ లు ఆడి 30 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్ లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్లో 22 వికెట్లు తీశాడు. ఆసియా కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా శ్రీలంక మాజీ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య పేరిట ఉంది. 25 మ్యాచ్లో 6 సెంచరీలు చేశాడు. అదే సమయంలో ఆసియా కప్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండీస్ పేరిట నమోదయింది. 2008 లో భారత్ పై 13 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news