బీసీసీఐ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఆదివారం షెడ్యూల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నారు. 2019 అక్టోబర్ 23న ఆయన ఈ పదవిని చేపట్టారు. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు కార్యవర్గం కాలపరిమితి మూడు ఏళ్లు. ఈ ఏడాది అక్టోబర్ తో గంగూలి కార్యవర్గం పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది.

బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబర్ 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు కూడా అదే రోజున వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలి, సెక్రటరీగా జై షా కొనసాగుతున్నారు. అయితే గంగూలి ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని.. జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా పీఠం ఎక్కుతారని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news