కుదురుగా లేని పాక్ క్రికెటర్ లు, ఆరుగురికి కరోనా

-

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ క్రికెట్ టీం చేసిన ఒక పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కరోనా తీవ్రత ఉన్నా సరే వారు లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు కరోనా నిబంధనలను ఉల్లఘించడం విమర్శలకు వేదికగా మారింది. మొత్తం నాలుగు నిభంధనలను ఉల్లంఘించడంతో మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డ్ సీఈఓ వసీం ఖాన్ వెల్లడించారు.

న్యూజిలాండ్ ప్రభుత్వం వారికి చివరి వార్నింగ్ ఇచ్చింది అని ఆయన చెప్పారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా వారిని ఇంటికి పంపిస్తారు అని చెప్పారు. తాను న్యూజిలాండ్ ప్రభుత్వంతో మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సీరీస్ లో ఎలాంటి ఇబ్బందులు రాలేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news