IND Vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో416 పరుగులకు భారత్ ఆలౌట్

-

ఇంగ్లాండ్ తో బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్ లో రెండో రోజైన శనివారం ఓవర్నైట్ స్కోరు 338/7 తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టులో రవీంద్ర జడేజా 194 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 13 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగాడు. చివర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. వరుస బౌండరీలు బాదేశాడు.

మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో 84.5 ఓవర్లు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (17), పూజార (13), హనుమ విహారి (20) ,విరాట్ కోహ్లీ (11) శ్రేయస్ అయ్యర్ (15) రిషబ్ పంత్( 146) పరుగులు చేశారు.ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మ్యాత్యూ ప్యాడ్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్, స్టోక్స్, రూట్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టెస్ట్ క్రికెట్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా భూమ్రా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news