అదరహో : ఐపీఎల్ లో కొనసాగుతున్న ఇండియా బౌలర్ల జోరు !

-

ఇండియా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 లో జరుగుతున్న ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఇండియా తరపున బౌలర్లు ప్రత్యర్థులను తమదైన స్పీడ్ అండ్ స్వింగ్ తో బెంబేలెత్తిస్తూ వికెట్లను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా బౌలర్లు అయిన మహమ్మద్ సిరాజ్ , అర్ష్ దీప్ సింగ్ మరియు హర్షల్ పటేల్ లు నిలకడగా వికెట్లను సాధిస్తున్నారు. బెంగుళూరు తరపున ఆడుతున్న సిరాజ్ ఇప్పటి వరకు 13 వికెట్లను కూలగొట్టి అత్యధిక బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.

ఇతనికన్నా ముందుగా అర్ష్ దీప్ సింగ్ 13 వికెట్లతో నిలిచినా ఎకానమీ మరియు యావరేజ్ లను దృష్టిలో ఉంచుకుని పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. దీనితో వీరిద్దరిపై నాచనలు పెరిగిపోతున్నాయి, వీరి జోరు చూస్తుంటే ఇక ముందు జరిగే మ్యాచ్ లలోనూ ఇదే ప్రదర్శన చేసి పర్పుల్ క్యాప్ ను అందుకునేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news