షాకింగ్: సీఎం యోగి ఆదిత్యనాధ్ ను చంపేస్తానని వార్నింగ్ కాల్

-

ఈ మధ్యన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుండి బెదిరింపు కాల్ ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్ గా మనము చూసుకుంటే కర్ణాటక సినీ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీ లోకి చేరుతున్నాడన్న వార్త ప్రకటించగానే అతనికి ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఇదే తరహాలో తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి తొందరలోనే సీఎం యోగి ఆదిత్యనాధ్ ను చంపేస్తానని చెప్పి పెట్టేశాడట.

ఈ విషయాన్ని అధికారులు తెలియచేశారు, అయితే వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ కాల్ ను ట్రేస్ చేసి ఫోన్ చేసిన వ్యక్తిని రిహాన్ గా గుర్తించారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కు ఇంకా ప్రొటెక్షన్ టైట్ చేశారు. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news