IPL-2022 CSK vs KKR : తొలి మ్యాచ్ లో చెన్నైపై కోల్‌కత్త బోణీ

-

ఐపీఎల్ – 2022 లో తొలి మ్యాచ్ చెన్నైసూప‌ర్ కింగ్స్, కోల్‌కత్త నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్ లో కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బోణీ కొట్టింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగ ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్‌క‌త్త.. బౌలింగ్ చేసింది. దీంతో తొల‌త చెన్నై బ్యాటింగ్ చేసింది. చెన్నైఓప‌న‌ర్లు విఫ‌లం అయ్యారు. అయితే చివ‌ర్లో ధోని అర్థ శ‌త‌కం బాద‌డంతో చెన్నై 131 ప‌రుగులను 5 వికెట్లు కోల్పోయి చేసింది.

అనంత‌రం కోల్‌క‌త్త జ‌ట్టు 132 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. అయితే ఓపెన‌ర్లు అజిక్య ర‌హానే (44) శుభారంభాన్ని ఇచ్చాడు. అలాగే వెంక‌టేశ్ అయ్యార్ (16), నితీశ్ రానా (21), బిల్లింగ్స్ (25) తో పాటు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యార్ (20 నాటౌట్) చూశారు. దీంతో కోల్‌క‌త్త 18.3 ఒవ‌ర్లోనే గెలుపొందింది. కాగ ఈ మ్యాచ్ లో ప్ర‌ధాన‌మైన రెండు వికెట్లు తీసిన ఉమేశ్ యాద‌వ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఉమేశ్ యాద‌వ్ ఈ మ్యాచ్ లో 4-0-20-2 తో రాణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news